యోనెక్స్–సన్రైజ్ 48వ నేషనల్స్ ముగింపు..
Hyderabad : అరుణాచల్ప్రదేశ్ ఇటానగర్ (Arunachal Pradesh Itanagar)వేదికగా జరిగిన యోనెక్స్–సన్రైజ్ 48వ ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్ & జూనియర్ నేషనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ (Junior Nationals Badminton Tournament)బుధవారం ఘనంగా ముగిసింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన బ్యాట్మెంటన్ ప్రతిభావంతుల మధ్య జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు మరోసారి తమ దమకాన్ని చాటారు. అండర్–19 విభాగంలో తెలంగాణ బాలికలు అద్భుత ఫారమ్లో రాణిస్తూ ప్రత్యర్థులను అదరగొట్టి జాతీయ విజేతలుగా మెరిశారు.
ఆఖరి వరకు దూకుడును కొనసాగించిన రాష్ట్ర జూనియర్ బాలికల జట్టు నిర్ణాయక మ్యాచ్లో చెలరేగి ఫస్ట్ ప్లేస్ను కైవసం చేసుకుంది. అదే విభాగంలో ఢిల్లీ జట్టు రన్నరప్గా నిలిచింది. మరోవైపు తెలంగాణ బాలురు కీలక మైన ఢిల్లీ జట్టుతో తడబడి తృతీయ స్థానం దక్కించుకున్నారు. పోటీలంతా మంచి నైపుణ్యం ప్రదర్శించినప్పటికీ సెమీఫైనల్లో కొన్ని కీలక పొరపాట్లు వారికి ఖరీదయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ జట్టును జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో సాధించిన ఈ విజయాలు తెలంగాణ బ్యాడ్మింటన్కు మరింత గౌరవం తీసుకొచ్చాయని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనతో రాష్ట్రం నుంచి మరిన్ని ప్రతిభావంతుల ఎదుగుదల నమోదవుతుందని క్రీడావర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
