end
Tuesday, August 18, 2026
వార్తలురాష్ట్రీయంసీఎం పర్యటన వాయిదా
- Advertisment -

సీఎం పర్యటన వాయిదా

- Advertisment -
- Advertisment -

భూపాలపల్లి: అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. భూపాలపల్లి జిల్లా పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది. రెండు రోజులుగా ఊపిరితిత్తుల్లో మంటతో బాధ పడుతున్న సీఎం కేసీఆర్‌ గురువారం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఛాతీలో మంట వస్తుందని వైద్యులకు చెప్పడంతో ఆయనకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా లక్షణాలు లేవని తేల్చారు. ఐదు రోజులకు కావాల్సిన మందులు ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -