యమునా నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. పడవ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పడవలో ఉన్న వారంతా చూస్తుండగానే నీళ్లలోకి పడిపోయి గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాందాలోని యమునా నదిలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. నదిలో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది. దీంతో అది ఒక వైపుకు వాలిపోయింది. పడవలో ఉన్న ప్రయాణికులు.. భయభ్రాంతులకు గురయ్యారు. చూస్తుండగానే నీళ్లలోనికి జారీపోయారు. పడవ ప్రమాదంలో 20 మంది వరకు ప్రయాణికులు గల్లంతైయినట్లు అధికారులు గుర్తించారు. బోల్తాపడిన పడవలో 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫతేపూర్ వెళ్ళేందుకు నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. స్థానికంగా ఉన్న అధికారులు అక్కడికి చేరుకున్ని సహాయక చర్యలను చేపట్టారు. బాధితుల కుటుంబ సభ్యులు నది దగ్గరకు చేరుకుని తమ వారికోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సంఘటన స్థలానికి ప్రత్యేక పడవల్లో వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.
- Advertisment -
నదిలో బోల్తాపడిన పడవ.. 20 మంది దుర్మరణం…
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -
