end
=
Thursday, May 16, 2024
వార్తలుజాతీయంRajasthan:ప్రియుడికోసం మూడేళ్ల కూతురిని చంపిన తల్లి
- Advertisment -

Rajasthan:ప్రియుడికోసం మూడేళ్ల కూతురిని చంపిన తల్లి

- Advertisment -
- Advertisment -

అక్రమ సంబంధం (illigal relationship) మోజులో పడి మూడేళ్ల కూతురిని చంపింది ఓ కిరాతక తల్లి. కదులుతున్న రైలు (Train) నుంచి బిడ్డను విసిరేసి దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ (Sriganganagar) జిల్లాలో తన మూడేళ్ల కూతురిని హత్య చేసిన ఓ వివాహిత కదులుతున్న రైలు నుండి ఆ మృతదేహాన్ని విసిరేసింది. జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులు సునీత, సన్నీ అలియాస్ మాల్టాగా (Sunita, Sunny alias Malta) గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.సోమవారం అర్ధ రాత్రి మహిళ తన కుమార్తె కిరణ్‌ (Kiran)ను గొంతు నులిమి, సన్నీ సహాయంతో ఆమె మృతదేహాన్ని బెడ్‌షీట్‌ (bed sheeet) లో చుట్టి శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పాప మృతదేహంతో పాటు ఉదయం 6:10 గంటలకు రైలు ఎక్కారు. అది ఫతుహి రైల్వే స్టేషన్ సమీపంలోని కాలువపై ఉన్న వంతెన వద్దకు చేరుకోగానే వారు కదులుతున్న రైలు నుండి మృతదేహాన్ని విసిరేసినట్టు పోలీసు సూపరింటెండెంట్ (శ్రీగంగానగర్) ఆనంద్ శర్మ (Anand sharma) తెలిపారు.

మృతదేహాన్ని కాలువలో పడేయాలనుకున్నారని, అయితే అది రైలు పట్టాల దగ్గర పడిందని, మంగళవారం ఉదయం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఐదుగురు పిల్లలు కలిగిన సునీత ఇద్దరు కుమార్తెలు, సన్నీతో కలిసి శాస్త్రినగర్‌లో (Shastrinagar) నివసిస్తోంది. ముగ్గురు పిల్లలు ఆమె భర్తతో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాలికను గుర్తించిన తర్వాత పోలీసులు సునీతను గుర్తించి విచారణ కోసం పిలిచారని వారు తెలిపారు. విచారణలో ఆమె తన కుమార్తెను చంపినట్లు అంగీకరించింది.

(Secunderabad:సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -