end
Saturday, June 27, 2026
వార్తలుఅంతర్జాతీయంప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం
- Advertisment -

ప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం

- Advertisment -
- Advertisment -

Ethiopia : భారత ప్రధాని నరేంద్ర మోదీ(Indian Prime Minister Narendra Modi)కి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం(international respect) దక్కింది. ఆఫ్రికా ఖండంలోని ప్రముఖ దేశమైన ఇథియోపియా, తన అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’(The Great Honor Nishan of Ethiopia) ను ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. మంగళవారం అడ్డిస్ అబాబాలోని అడ్డిస్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్ అలీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మోదీ స్వీకరించారు. ఈ అవార్డును అందుకున్న తొలి ప్రపంచ దేశాధినేత లేదా ప్రభుత్వాధినేతగా మోదీ చరిత్ర సృష్టించడం విశేషం. భారత్–ఇథియోపియా మధ్య బలమైన భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి, అలాగే ప్రపంచ వేదికపై ఆయన చూపుతున్న దార్శనిక నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు కొత్త మైలురాయికి చేరుకున్న సమయంలో ఈ పురస్కారం రావడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, ఈ గౌరవాన్ని తాను వ్యక్తిగతంగా స్వీకరించడం లేదని, 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలలో ఒకటైన ఇథియోపియా నుంచి ఈ పురస్కారం అందుకోవడం నాకు గర్వకారణం. ఇది భారత ప్రజలపై ప్రపంచం చూపుతున్న విశ్వాసానికి నిదర్శనం అని ఆయన అన్నారు. అలాగే, తన స్నేహితుడు, సోదరుడిలాంటి ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్ ఆహ్వానం మేరకు ఈ దేశానికి రావడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు.

భారత్–ఇథియోపియా ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుతున్నట్లు ఇరు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. విద్య, ఆరోగ్యం, వాణిజ్యం, సాంకేతికత వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించనున్నట్లు స్పష్టం చేశాయి. వందేళ్లకు పైగా భారతీయ ఉపాధ్యాయులు ఇథియోపియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విద్యే ఇరు దేశాల మధ్య బలమైన బంధానికి పునాది వేసిందని మోదీ గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీకి లభించిన 28వ అత్యున్నత విదేశీ పురస్కారం ఇదే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠ పెరుగుతున్నదానికి, మోదీ నాయకత్వానికి ఇది మరో స్పష్టమైన నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -