end
Sunday, April 26, 2026
వార్తలుజాతీయంమళ్లీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం
- Advertisment -

మళ్లీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం

- Advertisment -
- Advertisment -

Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport) మరోసారి సాంకేతిక సమస్యలతో ఇరుక్కుంది. శుక్రవారం ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో ఆకస్మికంగా తలెత్తిన లోపం కారణంగా విమానాల రాకపోకలు దెబ్బతిన్నాయి. ఈ లోపం కారణంగా పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని విమానాలు అర్థగంటకు పైగా రన్‌వేపై నిలిచిపోయి, మరికొన్ని గగనతలంలో చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణ షెడ్యూల్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒకరు ఈ ఘటనపై మాట్లాడుతూ, తమ విమానం సుమారు అరగంటపాటు రన్‌వేపై నిలిచిపోయిందని తెలిపారు. ఏటీసీ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ జాప్యం జరిగిందని సిబ్బంది వివరించారని పేర్కొన్నారు. ఈ లోపం కారణంగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ రెండింటికీ కొంతసేపు అంతరాయం ఏర్పడింది.

బోర్డింగ్ గేట్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగిపోగా, అనేక విమానయాన సంస్థలు తమ ప్రయాణికులను ఓపికగా ఉండమని అభ్యర్థించాయి. సాంకేతిక నిపుణులు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని ఎయిర్ ఇండియా సిబ్బంది తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే వారంలో ఇదే విమానాశ్రయంలో ఇలాంటి సాంకేతిక లోపం రెండోసారి చోటుచేసుకుంది. కేవలం రెండు రోజుల క్రితం, బుధవారం నాడు కూడా ఇలాంటి సమస్య తలెత్తి విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. అప్పుడు విమానాశ్రయ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించామని, కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఆందోళన లేకుండా కొనసాగించవచ్చని తెలిపారు.

బుధవారం జరిగిన ఘటనపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, థర్డ్ పార్టీ కనెక్టివిటీ నెట్‌వర్క్‌లో లోపం ఏర్పడటంతో తమ చెక్-ఇన్ సిస్టమ్‌లు, ఇతర ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. సమస్య పరిష్కారమైందని, కానీ పూర్తిస్థాయి స్థిరత్వం వచ్చే వరకు కొన్ని విమానాలు ఆలస్యంగా నడవొచ్చని కూడా తెలిపింది. అయితే, రెండు రోజుల్లోపే మళ్లీ ఇదే తరహా లోపం పునరావృతం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పుడే సరిచేశామని చెప్పిన సిస్టమ్ మళ్లీ విఫలమవడం ఆందోళన కలిగిస్తోంది అంటూ పలువురు ప్రయాణికులు విమానయాన సంస్థలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజా ఘటనపై ఎయిర్ ఇండియా లేదా ఇతర ఎయిర్‌లైన్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సాంకేతిక బృందాలు కారణాలను పరిశీలిస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -