వెబ్డెస్కు : జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం-2’ మూవి తెరకక్కనుంది. దీనికి ఆంటోని పెరంబవుర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్లాల్, మీనా కీలక పాత్రలో నటిస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వం షరుతులతో కూడిన అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం ఈ చిత్రం షూటింగ్ను ప్రారంభించారు. ఇటీవల లాల్ పుట్టిన సందర్భంగా దృశ్యం సీక్వెల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేరళలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ను వాయిదా వేశారు. ఈ చిత్రం యూనిట్ సెప్టెంబరు 26నుంచి సెట్స్లో అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం.
రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనల అనుగుణంగా చిత్రీకరణ జరుపుతామని చిత్ర బృందం ప్రకటించింది. అదే విధంగా యూనిట్ మొత్తానికి ఒక కండీషన్ కూడా పెట్టినట్లు సమాచారం. సినిమాలో నటించబోయే వారు తమ షూటింగ్ పూర్తయ్యే వరకు ఎటువంటి ప్రయాణాలు చేయడానికి వీలు లేదని స్పష్టంగా చెప్పిందట. 2013లో విడుదలైన ‘దృశ్యం’ మూవీ తెలుగులోనూ మలయాళంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మలయాళ ఇండస్ర్టీలో బాక్సాఫీసు వద్ద రూ. 50కోట్లు వసూలు చేసి మొదటి చిత్రంగా నిలిచింది. మోహన్లాల్ నటించిన ‘మర్కర్’ ఈ ఏడాది ఏప్రీల్లో విడుదల కావాల్సి ఉండగా కానీ కొవిడ్ కారణంగా వాయిదా వేషారట.