end
=
Wednesday, July 30, 2025
సినీమా‘వీరమల్లు’ టికెట్ ధరల పెంపు ఎంతంటే?
- Advertisment -

‘వీరమల్లు’ టికెట్ ధరల పెంపు ఎంతంటే?

- Advertisment -
- Advertisment -

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ నటించిన పీరియాడిక్​ చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రం ఈనెల 24న థియేటర్లలో విడుదల కానున్నది. నాలుగైదు సంవత్సరాల నుంచి సినిమా పవన్​ అభిమానులను ఊరిస్తున్నది. రెండు, మూడు సార్లు సినిమా రిలీజ్​ పోస్ట్​పోన్​ కావడం కూడా అభిమానులను నిరాశ పరిచింది. ఎట్టకేలకు ఈ నెల చిత్రం విడుదలవుతున్నది. దీంతో అభిమానుల్లో చిత్రానికి మంచి క్రేజ్​ ఉంది. భారీ బడ్జెట్​ తీసిన ఈ చిత్రంపై మేకర్స్​ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అయితే.. ఏపీలో చిత్రానికి టికెట్​ ధరలు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దీంతో 10 రోజుల వరకు రేటు పెంచుకునే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో లోయర్ క్లాస్‌పై రూ.100, అప్పర్ క్లాస్‌పై రూ.150 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇక మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ధరలపై జీఎస్టీ అదనంగా వసూలు చేయొద్దని, జీఎస్టీ కలుపుకొనే టికెట్ ధర నిర్ణయించామని సర్కార్ స్పష్టం చేసింది.

మరోవైపు తెలంగాణలో టిక్కెట్​ రేట్లు పెంచేందుకు అవకాశ కల్పించాలని మేకర్స్​ తాజాగా రాష్ట్ర సర్కారుకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -