‘శివ’ సినిమా ఇచ్చి రామ్గోపాల్ వర్మను(Director Ramgopal Varma), ‘నిన్నే పెళ్లడతా’ ఇచ్చి కృష్ణవంశీని(Director Krishna Vamshi) మేటి దర్శకులని నిరూపించుకునేలా చేసిన కింగ్ నాగార్జున(Actor Nagarjuna) మూడు దశాబ్దాల(Three decades works) నుంచి అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్భట్ను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి, ప్రేక్షకులకు ‘క్రిమినల్’ లాంటి క్రైం థ్రిల్లర్ చిత్రాన్ని అందించారు. మాలీవుడ్ టాప్ దర్శకులు ఫాజిల్, ప్రియదర్శన్ను సైతం టాలీవుడ్ను పరిచయం చేశారు.
ఫాజిల్తో ‘కిల్లర్’, ప్రియదర్శన్తో ‘నిర్ణయం’ చిత్రాలను తీసి ప్రేక్షకులను మెప్పించారు. సందీప్ చౌతా వంటి ఔత్సాహిక సంగీత దర్శకుడుని తెలుగు తెరకు పరిచయం చేశారు. కొత్త కొత్త టెక్నీషియన్లను ఇండస్ట్రీకి అందించారు. అప్పట్లో పాన్ ఇండియన్ స్టార్గా పలు భాషా చిత్రాల్లో నటించారు. ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలు సాధించి అభిమానుల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఇప్పటికే కుబేర చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. త్వరలో కూలీ చిత్రం కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత నాగార్జున 100వ చిత్రం మొదలు కానున్నది. ఈ సినిమాకు పా కార్తీక్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. మరో విషయం ఏంటంటే.. చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్ను సైతం ఖరారు చేశారని తెలుస్తోంది.
ఆగస్టు 29న నాగ్ జన్మదినం సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ వస్తుందని సమాచారం.