end
=
Sunday, January 25, 2026
వార్తలుజాతీయంపుతిన్ భారత్‌ పర్యటన.. నేడు మోడీతో ద్వైపాక్షిక చర్చలు, పలు కీలక ఒప్పందాలు
- Advertisment -

పుతిన్ భారత్‌ పర్యటన.. నేడు మోడీతో ద్వైపాక్షిక చర్చలు, పలు కీలక ఒప్పందాలు

- Advertisment -
- Advertisment -

India Ttour : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Russian President Vladimir Putin) రెండు రోజుల భారత పర్యటన(India tour)లో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యతను తీసుకొచ్చింది. విమానాశ్రయంలో కలుసుకున్న వెంటనే ఇద్దరు నేతలు సాన్నిహిత్యాన్నిచాటుతూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోదీ, పుతిన్‌కు ప్రత్యేక బహుమతిగా రష్యన్ భాషకు అనువదించిన పవిత్ర గ్రంథం ‘భగవద్గీత’(Bhagavad Gita)ను అందజేశారు. సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీకి చేరిన పుతిన్‌ను స్వాగతించిన తర్వాత, ఇద్దరు నేతలు ఒకే వాహనంలో ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌కు చేరుకున్నారు.

అక్కడ పుతిన్ గౌరవార్థం మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పుతిన్‌ రాకపై మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ, “నా మిత్రుడు అధ్యక్షుడు పుతిన్‌ను భారత్‌ భూమిపై ఆత్మీయంగా స్వాగతించడం చాలా సంతోషకరం. మా సమావేశాలు, చర్చల కోసం ఎదురుచూస్తున్నాను. భారత్–రష్యా స్నేహం కాలపరీక్షను ఎదిరించి నిలిచింది” అని పేర్కొన్నారు. ఈ రోజు పుతిన్‌ పర్యటన మరింత బిజీగా కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు అధికారిక గౌరవ స్వాగతం ఇవ్వబడుతుంది. అక్కడి నుండి 11:30 గంటలకు రాజ్‌ఘాట్‌కు చేరుకొని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో రక్షణ, శక్తి, వాణిజ్యం వంటి పలు రంగాల్లో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 1:50 గంటలకు ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొని సమావేశ ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై వివరాలు వెల్లడించనున్నారు. సాయంత్రం పుతిన్ భారత పారిశ్రామికవేత్తలతో సమావేశమై వ్యాపార సంబంధాలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాత్రి 9 గంటలకు పుతిన్‌ తన రెండు రోజుల పర్యటనను ముగించుకొని రష్యాకు తిరుగు ప్రయాణమవుతారు. ఈ పర్యటనతో భారత్–రష్యా సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -