end
=
Tuesday, June 17, 2025
రాజకీయంగోదావరి పుష్కరాలకు కేంద్రం మొండిచేయి
- Advertisment -

గోదావరి పుష్కరాలకు కేంద్రం మొండిచేయి

- Advertisment -
- Advertisment -

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ

తెలంగాణలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల(Godavari Puskaralu) నిర్వహణకు కేంద్రం మొండిచేయి చూపిస్తున్నదని, నిధులు విడుదలలో తీవ్ర అన్యాయం(Gross Injustice) చేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి(Endowment Dept)  కొండా సురేఖ(Konda Surekha) మండిపడ్డారు. నిధుల విడుదల అంశంపై తాను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి బహిరంగ లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు.

సోమవారం ఆమె వరంగల్​ జిల్లాలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేసి మాట్లాడారు. కేంద్రం ఏపీకి ప్రాధాన్యం ఇస్తూ, తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తున్నదని ఆరోపించారు. బీఆర్​ఎస్​ హయాంలో ప్రజాప్రతినిధులు వరంగల్​ తూర్పు నియోజకవర్గంలో తట్టెడు మట్టైనా ఎత్తిపోయలేదని, కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు.

బీఆర్​ఎస్​ పాలనలో భూకబ్జాదారులు రాజ్యమేలారని మండిపడ్డారు. ఇందిర రాజ్యంలోనే నిరుపేదల కలలు సాకారమవుతాయని పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -