- సీసీ ఫుటేజ్లో రికార్డు
(JANGOAN) జనగాం: నిన్న మొన్నటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులి (TIGER) మంగళవారం రాత్రి జనగామ(JANGOAN) జిల్లాలోకి ఎంట్రీ అయ్యింది.ఈ వార్త దవానంలా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పులిని పట్టుకోవడానికి సిద్దెంకి పరిసరాల్లో అటవీశాఖ అధికారుల బోనును సైతం ఏర్పాటు చేశారు. కానీ అధి అటుగా వెళ్లకుండా శామీర్పేట గ్రామంలోని కోమటిరెడ్డి సుశీల వృద్ధాశ్రమం దగ్గర రాత్రి 11:30 సమయంలో కనిపించింది.ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో(cc tv record) రికార్డు అయ్యాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
