end
Sunday, July 26, 2026
వార్తలురాష్ట్రీయంచెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
- Advertisment -

చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

- Advertisment -
- Advertisment -

నందిగామ: మండల కేంద్రంలోని అంబాపురం చెరువులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి లోతు గుర్తించక చెరువులో మునిగి మృత్యువాత పడ్డాడు. వివరాలు చూస్తే.. గోదా కృష్ణయ్య (వయస్సు 38) నందిగామ నివాసి. ఆదివారం మధ్యాహ్నం ఈతకని వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పక్కనే కరెంటు స్థంబాల పని చేస్తున్న వ్యక్తులు గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెతికి బయటికి తీసేందుకు ఎవరూ సాహసించకపోవడంతో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి మరియు పోలీస్ ల సమక్షంలో నర్సప్పా గూడ గ్రామానికి చెందిన గజ ఈతగాడు రాజు సాయంతో మృతదేహాన్ని బయటకు తీసారు. పోలీసులు మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ హాస్పటల్ తరలించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బిక్కు బిక్కుమంటూ ఏడుస్తుంటే.. అక్కడున్న వారు చలించిపోయారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -