end
Thursday, June 11, 2026
వార్తలురాష్ట్రీయంమావోయిస్టుల ప్లాన్‌ ఫెయిల్‌
- Advertisment -

మావోయిస్టుల ప్లాన్‌ ఫెయిల్‌

- Advertisment -
- Advertisment -
  • మందుపాతరలను నిర్వీర్యం చేసిన పోలీసులు

పోలీసులకు హతమార్చేందుకు మందుపాతరలను అమర్చిన మావోయిస్టుల ప్లాన్‌ విఫలమైంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం దొడ్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఆదేశాల మేరకు పోలీసులను చంపేందుకు భారీ ఎత్తున మందుపాతరలను అమర్చారు. అయితే పోలీసులు ఈ పన్నాగాన్ని కనిపెట్టి మందుపాతరలను నిర్వీర్యం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌, ఓఎస్‌డి శోభన్‌కుమార్‌, ఏఎస్సీ అశోక్‌కుమార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. మావోయిస్టులు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పనిచేయాలని వారు సూచించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -