end
Thursday, August 13, 2026
వార్తలురాష్ట్రీయంసీఎం స్పందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
- Advertisment -

సీఎం స్పందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

- Advertisment -
- Advertisment -
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

జనగామ: బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఫామ్‌హౌస్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వివేకానంద జయంతిని జరుపుకునే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. జనగామలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఏ విధంగా లాఠీచార్జ్ చేశారో దేశమంతా చూశారన్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవం కూడా తెలంగాణలో జరిపే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు వివేకానంద జయంతి జరుపుకుంటుంటే మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జనగామ ఘటనపై స్పందించాలని, కమిషనర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామని, భవిష్యత్ కార్యాచరణ జనగామ గడ్డ నుంచే ప్రకటిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -