end
=
Wednesday, May 15, 2024
క్రీడలుRam Charan:క్రికెటర్లకు విందు ఇచ్చిన మెగా హీరో..
- Advertisment -

Ram Charan:క్రికెటర్లకు విందు ఇచ్చిన మెగా హీరో..

- Advertisment -
- Advertisment -

  • ఇంటికి ఆహ్వానించి మర్యాదలు చేసిన రామ్ చరణ్
  • నెట్టింట వైరల్ అవుతున్న హార్దిక్‌ పాండ్య ఫొటోలు

(T20 Ranks :ఇండియానే నంబర్ 1)

Chiranjeevi Treat : భారత్‌ క్రికెటర్లకు(Indian Cricket Team) టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి(Chiranjeevi) ఫ్యామిలీ ఘనంగా విందు ఇచ్చింది. ఉప్పల్‌ స్టేడియంలో(Uppal Stadium) ఆస్ట్రేలియాతో తలపడి మ్యాచ్ విజయం సాధించిన అనంతరం మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌(Ram Charan) స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించి మర్యాదలు చేశాడు. హార్దిక్‌పాండ్య,(Hardik Pandya) సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు ఆటగాళ్లు రామ్‌ చరణ్‌ ఆహ్వానం మేరకు ఇంటికి చేరుకొని సందడి చేశారు. మెగా కుటుంబ సభ్యులు, పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పార్టీకి విచ్చేయగా క్రికెటర్లను రామ్ చరణ్ సన్మానించి, వారితో కాసేపు ముచ్చటించాడు. ఈ పార్టీలో హార్దిక్‌ పాండ్య ఓ వ్యక్తితో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

(T20 World Cup: బౌలర్లు.. అతడితో జాగ్రత్త)

ఇక రామ్‌ చరణ్‌ ఇంట జరిగిన విందుకు సంబంధించిన ఫొటోలు కూడా త్వరలో అధికారికంగా సోషల్‌ మీడియా(Social Media)లో చెర్రీ షేర్‌ చేయబోతున్నట్లు సమాచారం. కాగా ఇండియన్ క్రీడాకారులను, పలువురు సెలబ్రిటీలను సత్కరిస్తూ తండ్రి చిరంజీవి అడుగుజాడల్లోనే చెర్రీ  నడుస్తున్నాడంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. గతంలో మెగాస్టార్‌ ఎందరో క్రీడా, పొలిటికల్‌ సెలబ్రెటీ(celebrities)లకు ఆతిధ్యమిచ్చిన సందర్భాలున్నాయి. ఇక ఈ సంప్రదాయాన్ని చరణ్‌ కూడ కొనసాగిస్తూ గొప్ప మనసు చాటుకున్నాడంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

(Ramya Krishna: వయసు తోపాటు అమ్మడి అందం పెరుగుతు వస్తుందిగా!!!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -