end
=
Tuesday, July 1, 2025
రాజకీయంఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి అరెస్ట్​
- Advertisment -

ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి అరెస్ట్​

- Advertisment -
- Advertisment -

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
సుబేదారి పోలీస్​ స్టేషన్​లో ఆయనపై బెదరింపుల కేసు
పీఎస్​ బయట బీఆర్​ఎస్​ శ్రేణుల ఆందోళన

హుజూరాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిని సుబేదారి పోలీసులు శనివారం ఉదయం శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో అదుపులోకి తీసుకున్నారు. క్వారీ నిర్వహిస్తున్నందుకు తనకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి తమను బెదిరింపులకు పాల్పడాడని హనుమకొండ జిల్లా కమలాపూర్​ మండలానికి చెందిన ఓ క్వారీ యజమాని సతీమణి ఇటీవల సుబేదారి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్యేపై బీఎన్​ఎస్​ సెక్షన్​ 308 (2), (4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగానే శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ఎమ్మెల్యేను అరెస్ట్​ చేశారు.

కుట్రలకు భయపడం..ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి
సీఎం రేవంత్​రెడ్డి కుట్రలకు తాము భయపడేది లేదని, అక్రమ కేసులను ఎదుర్కొంటామని ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి పేర్కొన్నారు. సీఎం తన బినామీల ద్వారా నడిపిస్తున్న అక్రమ క్వారీ పనులను ప్రశ్నించనందుకే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ, తాను వెనుకాడనని, ప్రభుత్వ పెద్దల అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్​పోర్టులను తనను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

కమలాపూర్​ మండలంలో సీఎం రేవంత్​, మంత్రి సీతక్క బినామీలు క్వారీ నడిపిస్తున్నారని, వాటిని అక్రమ దందా చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని దుయ్యబట్టారు.

ఎంజీఎంలో వైద్యపరీక్షలు..
ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు సరాసరి ఆయన్ను వరంగల్​కు తరలించారు. ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం సుబేదారి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. పోలీస్ స్టేషన్​ ఎదుట బీఆర్​ఎస్​ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్​భాస్కర్​ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది.

కేసులు మా సంకల్పాన్ని దెబ్బతీయలేవు
పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​

ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి అరెస్ట్​పై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ స్పందించారు. అక్రమ కేసులు బీఆర్​ఎస్​ నేతల సంకల్పాన్ని దెబ్బ తీయలేవని కొట్టిపడేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. సీఎం రేవంత్​రెడ్డి నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్​, మంత్రుల అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.​

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -