end
=
Monday, April 29, 2024
వార్తలురాష్ట్రీయంMLA Lasya Nanditha Died: కారు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మల్యే లాస్యనందిత మృతి
- Advertisment -

MLA Lasya Nanditha Died: కారు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మల్యే లాస్యనందిత మృతి

- Advertisment -
- Advertisment -

Lasya Nanditha : కారు ప్రమాదంలో(Car Accident) సికింద్రాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత(37)(MLA Lasya Naditha Died) మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాధ సంఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే లాస్య ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు(Patancheru ORR) ఓటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్‌, పీఎ ఆకాశ్‌ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు(Police) హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని లాస్య మృతదేహాన్ని పటాన్‌ చెరులోని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాధం నెలకొంది. అంతేగాకుండా బీఆర్‌ఎస్‌ (BRS Leaders) పార్టీలోని నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి(Shock) లోనయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి,(CM Revanth Reddy) మాజీ సీఎం కేసీఆర్‌(KCR) కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

లాస్యనందిత దివంతగత నేత సాయన్న(Sayanna) కుమార్తె. గత సంవత్సరం సాయన్న ఫిబ్రవరి 19న మృతి చెందారు. సంవత్సరం తిగరకుండానే తండ్రి కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో చెప్పలేని బాధ, విషాధం మిగిల్చింది. లాస్య 1987లో హైదరాబాద్‌లో జన్మించింది. కంప్యూటర్‌సైన్స్‌లో బిటెక్‌ పూర్తి చేసి 2015లో రాజకీయాల్లోకి వచ్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -