end
=
Tuesday, January 21, 2025
వార్తలుజాతీయంగానగంధర్వుడు బాలు ఇక లేరు
- Advertisment -

గానగంధర్వుడు బాలు ఇక లేరు

- Advertisment -
- Advertisment -
  • 50 రోజులుగా కరోనాతో పోరాడిన బాలసుబ్రహ్మణ్యం
  • తీవ్ర దిగ్ర్భాంతిలో అభిమానులు, కుటుంబ సభ్యులు

ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కరోనా వైరస్‌తో పోరాడి చివరికి కన్ను మూశారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా బాలు ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుండడంతో అభిమానులు ఆనందపడ్డారు. కానీ చివరికి అందరినీ శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. బాలసుబ్రహ్మణ్యం మరణవార్తను ఆయన కుమారుడు చరణ్‌ ధృవీకరించారు.

సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్‌

అనంతరం ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయ‌న మృతి చెంద‌డంతో ద‌క్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది.

కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -