end
=
Thursday, May 16, 2024
సినీమాSushmita :పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సిగ్గెందుకు..
- Advertisment -

Sushmita :పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సిగ్గెందుకు..

- Advertisment -
- Advertisment -

Periods : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పెద్ద కూతురు (daughter) సుస్మితా (Sushmita).. మహిళలు పీరియడ్స్ (Period) విషయంలో అస్సలు సిగ్గుపడకూడదంటోంది. పీరియడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ‘పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్’ (PURE) అనే సంస్థ ‘ప్యూరథాన్-2022’లో భాగంగా ‘పీరియడ్ పోవర్టీ రన్ ఈవెంట్’ (Period Poverty Run Event)గా అక్టోబర్ 9న ఉదయం 6.30 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కర్టెన్ రైజర్ విలేకరుల సమావేశం (Press meet) నిర్వహించి పోస్టర్ విడుదల చేయగా ఇందులో పాల్గొన్న సుస్మిత.. పీరియడ్స్ గురించి మహిళలు ధైర్యంగా మాట్లాడాలంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

(Allu Arjun:బర్త్ డే సర్ ప్రైజ్ కి రెండు కోట్లు ఖర్చు)

‘ఇలాంటి కార్యక్రమంలో  భాగమైనందుకు సంతోషంగా ఉంది. పీరియడ్స్ అనేవి మహిళ (Women) శరీర అభివృద్ధికి ఉపయోగపడతాయి. కాబట్టి వాటి గురించి అవగాహన కల్పించడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. అది గుర్తొచ్చినప్పుడల్లా బాధగా అనిపిస్తుంది. ఇప్పటికీ పీరియడ్స్ (Periods) గురించి మాట్లాడటానికి చాలా కుటుంబాల్లో మహిళలు ఇబ్బంది పడతారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమందికి శారీరకంగా (physically), మానసికంగా (mentally) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఎంతోమంది అమ్మాయిలు భారతదేశాన్ని (India) రిప్రజెంట్ చేస్తారు. అలాంటి వారి కోసం ఇలాంటి అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ.. ఇలాంటి మంచి విషయానికి సపోర్టు (Support) చేస్తూ.. అపోహలను తొలగించడానికి మగవాళ్లు కూడా రావడం గొప్ప విషయం’ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (Video viral)అవుతోంది.

(Elnaz:నా కుటుంబాన్ని రక్షించండి.. కన్నీటి పర్యంతమైన ఎల్నాజ్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -