end
=
Thursday, May 16, 2024
వార్తలురాష్ట్రీయంగోదావరి నదిలో విద్యార్థులు గల్లంతు
- Advertisment -

గోదావరి నదిలో విద్యార్థులు గల్లంతు

- Advertisment -
- Advertisment -

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఉగాది పండుగ రోజున ఏటూరునాగారం మండలం రోహీర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆకుదారి సాయివర్ధన్‌, సతీష్‌ బెడిక, డోంగిరి సందీప్‌ గోదావరి నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. నదిలో దిగి ఈత కొడుతుండగా ఒక్కసారిగా ప్రవాహం అధికం కావడంతో ఒడ్డుకు చేరలేక నదిలోనే కొట్టుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది పండుగ రోజే ఈ ఘటన జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -