end
Tuesday, May 19, 2026
క్రీడలుఅండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు
- Advertisment -

అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు

- Advertisment -
- Advertisment -

-కోహ్లి భావోద్వేగ ట్వీట్

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 13 వ సీజన్‌లో తొలి అర్ధభాగం అద్భుత విజయాలు సాధించిన రాయల్‌​చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు ఇంటిదారిపట్టింది. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ట్విటర్‌ వేదికగా ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌ 2020 లో జట్టు సభ్యులమంతా ఒడిదుడుకులను తట్టుకుని మెరుగైన ప్రదర్శన చేశామని పేర్కొన్నాడు. జట్టుగా తమకు ఇది గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చాడు.

కొన్ని పరిస్థితులు ఆర్సీబీకి అనుకూలించలేదని కోహ్లి వాపోయాడు. ఏదేమైనా టీమ్‌ సభ్యులు, సిబ్బంది సహకారం మరువలేనిదని చెప్పుకొచ్చాడు. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కోహ్లి కృతజ్ఞతలు చెప్పాడు. అభిమానుల ఆదరణతో మరింత బలం పుంజుకుని మళ్లీ కలుస్తానని సెలవు ప్రకటించాడు. కాగా, మేటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లోనూ కప్పు గెలవకపోవడం గమనర్హం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -