end
Tuesday, April 21, 2026
సినీమా75 రూపాయలకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడచ్చు!!!
- Advertisment -

75 రూపాయలకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడచ్చు!!!

- Advertisment -
- Advertisment -

మల్టీప్లెక్స్‌(Multiplex)లో సినిమా చూడాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే టికెట్ ధరలు చాలా ఎక్కువ అని అటువైపు కూడా చూసి చూడనట్టు ఉంటారు. అయితే ఇప్పుడు మల్లీప్లెక్స్‌ లో చూడాలని ఆశ నెరవేరబోతుంది. సామాన్యులకి కూడా అందుబాటులోకి రానున్న మల్లీప్లెక్స్‌ మూవీ టికెట్(Movie Ticket). 75 రూపాయలకే మల్లీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం రాబోతుంది. సెప్టెంబర్ 16న జాతీయ సినిమా దినోత్సవం(National Film Day) సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ఈ అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 4 వేల మంది కంటే ఎక్కువ వచ్చే మల్లీప్లెక్స్‌లలో రూ.75కే సినిమాలు చూడొచ్చు. అన్ని ప్రధాన నగరాలలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆడియన్స్‌కు ఈ డిస్కౌంట్ రేటు(Discount rate)కే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

తమ వ్యాపారాన్ని అభివృది చేసిన సినీ ప్రియుల కోసం 75 రూపాయలకే తక్కువ ధరకే సినిమా చూపించాలనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌డౌన్ తో జనాలు చాలా వరకు థియేటర్స్ వైపురావడమే మానేశారు. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఇంకా థియేటర్ల(Theaters)కు రాని సినీ ప్రేమికులకు ఇది ఆహ్వానం లాంటిది. సెప్టెంబర్ 16న ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సెప్టెంబర్ 16న 75 రూపాయలకే సినిమా టికెట్ అంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఆఫర్‌ను వినియోగించుకోండి. PVR, INOX, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండే ఛాన్స్ఉంటుంది . ఇంకా ఆయా వెబ్‌సైట్స్‌(Website)లో అప్‌డేట్ రావాల్సి ఉంది.

(100 శాతం సీటింగ్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -