end
Saturday, March 28, 2026
వార్తలుజాతీయం60 శాతం రాయితీపై వాహనాలు
- Advertisment -

60 శాతం రాయితీపై వాహనాలు

- Advertisment -
- Advertisment -

స్వయం ఉపాధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్‌సీ, ముస్లిం మైనారిటీ, క్రిష్టియన్‌ మైనారీటీ యువతకు శుభవార్త అందించింది. 60 శాతం సబ్సిడీపై ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసేందుకు 4 చక్రాల మినీ ట్రక్కులను అందించనుంది. ఎస్‌సీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా 2,300 వాహనాలు అందుబాటులోకి తేనుంది. అలాగే ముస్లింలకు 556, క్రిష్టియన్లకు 104 వాహనాలు అందించేందుకు ప్రభుత్వం సన్నద్దమయింది. ఏడో తరగతి పాసైన 21 నుంచి 45ఏళ్ల వయస్సున్న వారిని ముఖాముఖి ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఈ నెల 20 నుంచి ఆయా మండలాలు, పురపాలికల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -