end
Tuesday, August 25, 2026
వార్తలురాష్ట్రీయంముగిసిన నామినేషన్ల పర్వం
- Advertisment -

ముగిసిన నామినేషన్ల పర్వం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వంలో ఓ అంకం ముగిసినట్లైంది. గత మూడు రోజుల నుంచి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరించారు. గ్రేటర్‌ ఎన్నికలకు చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్‌ కమిషనర్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. మొత్తం నామినేషన్ల సంఖ్య వెయ్యికిపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆదివారం తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. మూడు గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ఎస్‌ఈసీ ప్రకటించనుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -