end
=
Tuesday, June 24, 2025
వార్తలురాష్ట్రీయంబ్యాంక్​ లాకర్లలో కట్టల కొద్దీ కరెన్సీ నోట్లు
- Advertisment -

బ్యాంక్​ లాకర్లలో కట్టల కొద్దీ కరెన్సీ నోట్లు

- Advertisment -
- Advertisment -

ఈఈ శ్రీధర్ అక్రమ డబ్బు ఇంకెంతో?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు (Un accountable Properties)లో చొప్పదండి ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ (Choppadandi EE Nunes Sridhar)​ నూనె శ్రీధర్​ని ఏసీబీ (Anti correption Bureau) అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో కాళేశ్వరం 6, 7, 8 ప్యాకేజీ (Kaleswaram Project Packages)ల పర్యవేక్షణ విధుల నిర్వహించిన సమయంలో ఆయన వందలాది కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల ఏసీబీ 13 చోట్ల ఏకకాలంలో చేసిన దాడుల్లో ఏకంగా రూ.150 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించింది. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం ఆయన బ్యాంకర్​ లాకర్​లో లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.5 కోట్ల నగదు గుర్తించి సీజ్​ చేసింది. ఏసీబీ అధికారులు మరోవైపు శ్రీధర్​ను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బదిలీ అయిన తర్వాత కూడా,

ఆయన ఆ ప్యాకేజీలను పర్యవేక్షించినట్లు దర్యాప్తులో గుర్తించారు. బదిలీ ఆదేశాలు ఉన్నప్పటికీ కాళేశ్వరం పరిధిలోనే ఎందుకున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -