end
Wednesday, August 19, 2026
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంశ్రీవారి లడ్డూ ధర పెంపు పై ప్రచారం..టీటీడీ స్పష్టత
- Advertisment -

శ్రీవారి లడ్డూ ధర పెంపు పై ప్రచారం..టీటీడీ స్పష్టత

- Advertisment -
- Advertisment -

BR Naidu: శ్రీవారి ప్రసాదంగా(Srivari Prasadam) భక్తులు ఎంతో భక్తితో స్వీకరించే తిరుపతి లడ్డూ (Tirupati Laddu)ధరను పెంచనున్నట్టు ఇటీవల కొందరు ప్రచారం చేయడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా స్పందించింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu)ఖండించారు. లడ్డూ ధర పెంపు విషయంలో తమకు ఎలాంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన తీసుకొచ్చే ఉద్దేశ్యం టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఈ తరహా అవాస్తవ వార్తలు కొన్ని బాధ్యతారహిత మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాల వెనుక టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చడమే లక్ష్యంగా ఉందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అపహాస్యం చేయాలన్న దురుద్దేశంతోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

‘‘పవిత్రమైన శ్రీవారి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా ఉంది. లడ్డూ ప్రసాదం భక్తులకు అందించడంలో టీటీడీ ఎల్లప్పుడూ సేవా దృక్పథంతోనే ముందుంటోంది. దీనిపై అసత్య కథనాలు ప్రచారం చేయడం బాధాకరం. లడ్డూ ధర పెరిగిందన్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం. భక్తులు ఇలాంటి వదంతులపై నమ్మకాన్ని పెట్టుకోరాదు,’’ అని బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు కథనాలు టీటీడీ సేవా కార్యక్రమాల పట్ల ప్రజల్లో అనవసరమైన అనుమానాలు కలిగించేలా చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థానం పేరు చెడగొట్టే ప్రయత్నాల్లో భాగంగానే కొందరు మీడియా సంస్థలు ఇలాంటి అసత్య ప్రచారాలకు తెగబడుతున్నాయని, ఇది ఖండించదగ్గ విషయమని అన్నారు. టీటీడీ కార్యకలాపాలు సంపూర్ణ పారదర్శకతతో కొనసాగుతున్నాయని, భక్తులకు అందించే అన్ని సేవలు నాణ్యతకు లోటుపడకుండా అందిస్తున్నామని పేర్కొన్నారు. చివరగా, భక్తుల మద్దతు, విశ్వాసం తమకు శక్తి అని, అలాంటి విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎలాంటి ఫలితానికీ దారి తీసవని బీఆర్ నాయుడు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ధరపై తప్పుడు ప్రచారాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మరోసారి పునరుద్ఘాటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -