కరోనా వైరస్ కారణంగా ఆగిన రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన రైలు సర్వీసులు, రైలు ఆగే స్టేషన్ వివరాలను ప్రకటించింది.
నేరాలు అరికట్టడంలో యోగి ప్రభుత్వం ఫెయిల్
దేశంలో అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా దాదాపు అన్నీ రవాణా వ్యవస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. దేశంలోని అన్ని రాష్ర్టాలలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు రోజు రోజుకు పెరగుతుండడంతో ప్రజలకు రైలు ప్రయాణ అవసరాలు పెరిగాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అన్ని రాష్ర్టాలలో రైలు సర్వీసులను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది.
రైలు సర్వీసులు – ఏపీలో అవి ఆగే స్టేషన్ల వివరాలు
- సికింద్రాబాద్-గుంటూరు, గుంటూరు-సికింద్రాబాద్(డైలీ)- నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి
- సికింద్రాబాద్-హౌరా, హౌరా-సికింద్రాబాద్ (డైలీ) – పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట
- (హైదరాబాద్-విశాఖ, విశాఖ- హైదరాబాద్)- తాడేపల్లిగూడెం, నిడదవోలు,అనపర్తి,సామర్లకోట, పిఠాపురం,అన్నవరం,తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి,దువ్వాడ
- (తిరుపతి-నిజామాబాద్, నిజామాబాద్-తిరుపతి)-రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి
ఇతర జోన్ల నుండి వచ్చే రైళ్లు
- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- చప్రా(సోమ-శని)- గూడూరు
- జైపూర్- మైసూర్ (సోమ-బుధ) – కర్నూల్ సిటీ,డోన్,ధర్మవరం
- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూ ఢిల్లీ డైలీ- గూడూరు,చీరాల,తెనాలి,
- న్యూ ఢిల్లీ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ డైలీ- తెనాలి,చీరాల గూడూరు
- గోరకపూర్ యశ్వంత్ పూర్(సోమ-శని)- ధర్మవరం
- యశ్వంత్ పూర్ గోరకపూర్(సోమ-గురు) ధర్మవరం..
- మైసూర్-జైపూర్(గురు-శని)- ధర్మవరం,డోన్,కర్నూల్ సిటీ..
- చప్రా-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (సోమ-బుధ)- గూడూరు..