end
Thursday, August 13, 2026
వార్తలురాష్ట్రీయంమేయర్ పీఠం మాదే
- Advertisment -

మేయర్ పీఠం మాదే

- Advertisment -
- Advertisment -
  • ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లికి విచ్చేసిన సోము వీర్రాజు స్థానిక కేపీహెచ్‌బీ, బాలాజీనగర్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భాగ్యనగరంలో మత రాజకీయాలు చేస్తున్న వారికి చరమగీతం పాడతామని, టీ ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలపై వ్యతిరేకతే బీజేపీని గెలిపిస్తుందని, ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం ఎట్టిపరిస్థితుల్లో భాజపా కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -