end
Tuesday, April 28, 2026
బిజినెస్‌Stock Market : లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
- Advertisment -

Stock Market : లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

- Advertisment -
- Advertisment -

స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,759.19 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు అదే ట్రెండ్‌ను రోజంతా కనొసాగించాయి. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాల నుంచి దిగొచ్చాయి. ఇంట్రాడేలో 62,943.20- 62,751.72 మధ్య కదలాడింది. చివరకు 240.36 పాయింట్ల లాభంతో 62,787.47 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,612.00 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,640.15- 18,582.80 మధ్య ట్రేడైంది. చివరకు 59.75 పాయింట్లు లాభపడి 18,593.85 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు పతనమై రూ.82.68 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం(M&M), ఎల్‌అండ్‌టీ(L&T), టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, షేర్లు లాభపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -