end
=
Monday, April 29, 2024
సినీమాఓటీటీకి కాస్త దూరంగా....
- Advertisment -

ఓటీటీకి కాస్త దూరంగా….

- Advertisment -
- Advertisment -

లాక్‌డౌన్‌ వల్ల ప్రజలంతా ఓటీటీ (OTT) కి బాగా అలవాటు పడిపోయారు. థర్డ్‌ వేవ్‌ కూడా ఉంటుందనే భయంతో ప్రభుత్వాలు 50% ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చాయి. సినిమా బాగుందనే టాక్‌ వచ్చినా పూర్తి స్థాయిలో జనాలు థియేటర్‌లో అడుగుపెట్టలేదు. అదే తరుణంలో ఏపీలో సినిమా టికెట్‌ ధరలు పెంచాలంటూ ఒక సమస్యను రేకెత్తించారు. కరోనా నుంచి పరిశ్రమను థియేటర్ల మనుగడను కాపాడుకోవాలంటే టికెట్‌ ధరలు పెంచాలంటూ పరిశ్రమ నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వాల చుట్టూ తిరిగి ఎలాగైతే కావలసినట్లుగా టికెట్‌ రేట్లు పెంచుకునేలా జీవో తెచ్చుకున్నారు. ఆ రేట్లతో బడా చిత్రాలు విడుదలయ్యాయి. అధిక రేట్లతో రెండు మూడు చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆస్వాదించారు. ఆ తర్వాత రేట్ల ప్రభావం ప్రేక్షకుడిపై బాగా పడింది. వినోదం పొందాలంటే ఇంత ఖర్చు చెయ్యాల అన్న ఆలోచన మొదలైంది. ఆ రేట్లు తట్టుకోలేక ప్రేక్షకుడు థియేటర్‌ వైపు చూడడం మానేశాడు.

మూడు వారాలు దాటితే ఓటీటీలో, రెండు నెలల్లో టీవీలో సినిమాను చూసేమొచ్చు అనే ఆలోచనకు వచ్చారు. ఈ ఎఫెక్ట్‌ను నిర్మాతలు తొందరగానే తెలుసుకున్నారు. టికెట్‌ రేట్ల దెబ్బకు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకున్నారు. దాంతో సాధారణ రేట్లకే సినిమా టికెట్‌ అంటూ ప్రచారం మొదలుపెట్టారు.ఆడియో ఫంక్షన్‌, ప్రీ రిలీజ్‌ వేడుకల్లో తమ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకొనే చిత్ర బృందాలు ఇప్పుడు సినిమా టికెట్‌ రేట్ల ప్రస్తావనతో ఈవెంట్‌ను ప్రారంభిస్తున్నారు.గడచిన రెండు వారాల్లో విడుదలైన ‘ఎఫ్‌3’ మరియు ‘మేజర్‌’ చిత్ర బృందాలు తమ సినిమాలో ఆసక్తికర విషయాలతోపాటు ప్రత్యేకంగా టికెట్‌ రేట్ల గురించి పత్యేకంగా ప్రస్తావించారు.టాలీవుడ్‌ బడా నిర్మాత, ‘ఆహా’ ఓటీటీ అధినేత అయిన అల్లు అరవింద్‌ ‘పక్కా కమర్షియల్‌’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. టికెట్లు రేట్లు తగ్గించడంతోపాటు ఓటీటీలకు కాస్త దూరంగా ఉండాలి. సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలో రాకుండా చూడాలి అని హితవు పలికారు.

ఇప్పుడు ఓటీటీల వల్ల అదే పరిస్థితి ఎదురైంది. సినిమా విడుదైన రెండు మూడు వారాలకే ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది. దీని వల్ల థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య బారిగా తగ్గిపోతుంది. మూడు వారాలు ఓపిక పడితే ఇంట్లోనే కూర్చొని చూడొచ్చనే ఆలోచనకు ప్రేక్షకుడు వచ్చేశాడు. పరిశ్రమ, మనుగడ బావుండాలంటే ఎలాంటి సినిమా అయినా విడుదలైన రెండు నెలల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన అమలు చేయాలి.అయితే ఈ నిబంధనలకు ఓటీటీ సంస్థలు అంగీకరిస్తాయా లేదా అన్నది వేచిచూడాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -