end
Monday, August 31, 2026
వార్తలుజాతీయంనూతన చట్టాలతో దేశానికి ప్రమాదం
- Advertisment -

నూతన చట్టాలతో దేశానికి ప్రమాదం

- Advertisment -
- Advertisment -

శాఖాహారంతో పూర్తి ఫిట్‌నెస్‌..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో దేశం పునాదులు బలహీనపడతాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నూతన చట్టాలతో దేశానికి ఎప్పటికైనా ప్రమాదమని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర అవరతణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.

బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్‌

రైతులు, కూలీలు దేశానికి పునాదుల వంటివారని, పల్లెలు పట్టణాలకు పునాదులని, వాటికి రైతులు, కూలీలు పునాదులుగా ఉంటారన్నారు. ఈ వ్యవస్థను బలహీనపరిస్తే… మొత్తం వ్యవస్థే దెబ్బ తింటుందని హెచ్చరించారు. ఈ వ్యవస్థను కాపాడుకుంటూ పోతే కేవలం వారిని మాత్రమే కాపాడినట్లు కాదని, దేశాన్ని కూడా కాపాడిన వారమవుతామని రాహుల్ పేర్కొన్నారు. అందుకే తాము కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -